రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు నియోజకవర్గంలో అమలైన పథకాల వివరాలు ఎన్నో ఏండ్లుగా డిమాండ్ ఉన్న గట్టుప్పల్ మండలాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆగమేఘాలపై పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయం ఏర్పాటు చేశారు... చర్లగూడెం భూనిర్వాసితులు పరిహారం కోసం గత ఏడు సంవత్సరాలుగా ధర్నాలు, ఆందోళనలు చేసినప్పటికీ పట్టించుకోని అధికారులు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత ప్రతి ఒక్క భూనిర్వాసితుడి ఖాతాలో రూ.7,60,000 డిపాజిట్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 7 వేల మందికి గొర్రెల యూనిట్స్ పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఖాతాలో రూ. 1.58 లక్షలు డిపాజిట్ చేశారు. ఖాతాలో పడిన అమౌంట్ను ఫ్రీజ్ చేసారు. గెలిచిన తర్వాతే డ్రా చేసుకోవచ్చు అని వాళ్లకు చెప్పారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలిసి మునుగోడు మండలం జమస్థానపల్లిలో 42 దళిత యూనిట్స్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో గిరిజన బంధు పథకం ప్రవేశపెట్టారు. చేనేత బీమా ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఇచ్చారు. చండూర్ పట్టణ కేంద్రంలో, చౌటుప్పల్ పట్టణ కేంద్రం...