రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు నియోజకవర్గంలో అమలైన పథకాల వివరాలు
- ఎన్నో ఏండ్లుగా డిమాండ్ ఉన్న గట్టుప్పల్ మండలాన్ని అధికారికంగా ప్రకటించారు.
- ఆగమేఘాలపై పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయం ఏర్పాటు చేశారు...
- చర్లగూడెం భూనిర్వాసితులు పరిహారం కోసం గత ఏడు సంవత్సరాలుగా
- ధర్నాలు, ఆందోళనలు చేసినప్పటికీ పట్టించుకోని అధికారులు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత ప్రతి ఒక్క భూనిర్వాసితుడి ఖాతాలో రూ.7,60,000 డిపాజిట్ చేశారు.
- నియోజకవర్గ వ్యాప్తంగా 7 వేల మందికి గొర్రెల యూనిట్స్ పంపిణీ చేశారు.
- లబ్ధిదారుల ఖాతాలో రూ. 1.58 లక్షలు డిపాజిట్ చేశారు. ఖాతాలో పడిన అమౌంట్ను ఫ్రీజ్ చేసారు. గెలిచిన తర్వాతే డ్రా చేసుకోవచ్చు అని వాళ్లకు చెప్పారు.
- రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలిసి మునుగోడు మండలం జమస్థానపల్లిలో 42 దళిత యూనిట్స్ ఇచ్చారు.
- మునుగోడు నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో గిరిజన బంధు పథకం ప్రవేశపెట్టారు.
- చేనేత బీమా ఇస్తున్నారు.
- రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఇచ్చారు.
- చండూర్ పట్టణ కేంద్రంలో, చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సిసి రోడ్లు వేశారు.
- హైదరాబాద్ - చౌటుప్పల్ రోడ్డుకు మరమ్మతులు చేశారు.
- చౌటుప్పల్ నారాయణపురం రోడ్డు పనులు చేశారు.
Comments
Post a Comment